బీబీనగర్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

బీబీనగర్ లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నాయకులు పేర్కొన్నారు. పార్టీ మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలను ఓటర్లకు వివరించారు. అలాగే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వైఫల్యాలను కూడా  ఓటర్లకు వివరిస్తూ, రానున్న ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓటేసి, కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ బీబీనగర్ పట్టణశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోలి నరేందర్ రెడ్డి, పంజాల పెంటయ్య, బెండ ప్రవీణ్, వెంకటేష్, లాలయ్య, మహేష్, శ్రీకాంత్, సదానందం, రాజు తదితరులు పాల్గొన్నారు.