ఆలోచించి ఓటేయండి - ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డా. తిరుణహరి శేషు

ఆలోచించి ఓటేయండి  - ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డా. తిరుణహరి శేషు

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌‌, పాలకుర్తి మూడు నియోజకవర్గల్లో ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని,  మీ ప్రాంత అభివృద్ధికి తోడ్పడే నేతను గెలుపించుకోవాలని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్‌‌ తిరుణహరి శేషు కోరారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా ఏర్పాటైన  జనగామ జిల్లాలో ఐటీ, వ్యవసాయ రంగం, విద్య, వైద్యం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే మంచి నాయకులను గెలుపించుకోవలన్నారు. సమావేశంలో తెలంగాణ లెక్చరర్ ఫోరమ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ డా.డి. నరేందర్ నాయక్, బీసీ జాక్ రాష్ట్ర కార్యదర్శి డా.ఈ.రమేశ్‌పాల్గొన్నారు.