పోస్టల్ బ్యాలెట్ కోసం కలెక్టర్ కు విజ్ఞప్తి

పోస్టల్ బ్యాలెట్ కోసం కలెక్టర్ కు విజ్ఞప్తి

ముద్ర ప్రతినిధి, మెదక్: ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలట్ అందించాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎస్టియూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.  ద  పిఓ, ఎపిఓలకు గజ్వెల్, దుబ్బాక వారికి సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో, అందోల్ వారికి సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో, నర్సాపూర్, మెదక్ వారికి మెదక్ కలెక్టర్ కార్యాలయంలో అందజేస్తారు. ఓపిఓలకు శిక్షణ కార్యక్రమంలోనే అందజేస్తారు. తేది తరువాత తెలియజేస్తామన్నారు, పోస్టల్ బ్యాలట్ వినియోగించు కొనేవారికి ఓడి సౌకర్యం ఉందని మెదక్ జిల్లా ప్రధానకార్యదర్శి రాజగోపాల్ గౌడ్ తెలిపారు. నర్సింగ్, శ్రీకాంత్ గౌడ్, కిష్టయ్య అశోక్, బాలకృష్ణ, శ్రీనివాస్, అరుణ్, మల్లేష్ తదితరులున్నారు.