ఇంటింటి ప్రచారంలో చిట్యాల జడ్పిటిసి..

ఇంటింటి ప్రచారంలో చిట్యాల జడ్పిటిసి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలం లక్ష్మీపురంతండాలో జడ్పీటీసీ గొర్రె సాగర్, బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భూపాలపల్లి బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి తోనే అభివృద్ధి జరుగుతుందని, కారు గుర్తుకు ఓటు వేయాలని జడ్పీటీసీ సాగర్ ఇంటింటికీ చెబుతూ ప్రచారం చేశారు. కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేయాలని సూచించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి లక్ష్మీపురంతండాకు చెందిన 30మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్యాల జడ్పిటిసి గొర్రె సాగర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో నగావత్ రాములు నాయక్, బానోత్ కపిల్, నగవత్ ప్రవీణ్, బానోత్ వినయ్, ప్రదీప్, దిలీప్ మరికొంతమంది ఉన్నారు.