దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

ముద్ర న్యూస్,కాటారం: గురు పౌర్ణమి సందర్భంగా సోమవారం మండలంలోని దేవాలయాలు భక్తులతో రాకతో కళకళలాడాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడలో గల శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఉదయం నుంచే పూజలు జోరుగా కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరాంభట్ల కృష్ణమోహన శర్మ ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం కన్నుల పండుగ నిర్వహించారు.అలాగే సహస్రనామార్చన,ప్రత్యేక పూజలు కొనసాగించారు. అనంతరం దత్తాత్రేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తి కి పల్లకి సేవ నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్తులకు ఆశీర్వచనం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు గణపతి శర్మ,ప్రవీణ్ కుమార్, లవకుశ, నాయకులు చల్ల జక్కిరెడ్డి,గంగిరెడ్డి లచ్చిరెడ్డి, ప్రముఖ వ్యాపారులు అల్లాడి శ్రీనివాస్,చంద్రమౌళి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.