ఓటేసిన కలెక్టర్ దంపతులు

ఓటేసిన కలెక్టర్ దంపతులు

ముద్ర ప్రతినిధి, జనగామ :జనగామ కలెక్టర్ శివలింగయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం మధ్యాహ్నం జనగామ ప్రిస్టన్ కాలేజ్ లో  ఏర్పాటు చేసిన 272 పోలింగ్ స్టేషన్ కు ఆయన సతీమణి వందనతో కలిసి వచ్చి  ఓటేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యతగా ఓటు వేయాలని కోరారు.