బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం - చందుపట్ల కీర్తిరెడ్డి

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం - చందుపట్ల కీర్తిరెడ్డి

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: బిజెపితోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల అధ్యక్షులు జిట్టబోయున సాంబయ్య ఆధ్వర్యంలో మైలారం, గాంధీనగర్, బుర్రకాయలగూడెం లో శనివారం నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి బీజేపీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ మీ ఆడబిడ్డగా మీ ఇంటి ముందుకు వచ్చాను ఆశీర్వదించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. భూపాలపల్లిలో మహిళా అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపిస్తే అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామి ఇచ్చారు.

అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కీర్తిరెడ్డి సమక్షంలో పలువురు నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.