చర్లపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కిట్ల పంపిణీ

చర్లపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కిట్ల పంపిణీ

ముద్ర , కాప్రా: కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి డివిజన్  పెద్ద చర్లపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌతమ్ నంద పుట్టినరోజు సందర్భంగా  బాల బాలికలకు టైలు, బెల్టులు, బ్యాచిలు, బస్సు పాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చర్లపల్లి పొలీస్ స్టేషన్ సీఐ మల్లికార్జున రెడ్డి పాల్గొని  పాఠశాల విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బొడిగ రవి మాట్లాడుతూ  గత 4 సంవత్సరాల నుండి మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.ఉచిత వైద్య శిబిరాలు, గర్భిణీ స్త్రీలకు పాలు, బ్రెడ్లు, గుడ్లు, వైకుంఠధామరథం, యోగా శిక్షణాలు, ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించామన్నారు, ఈరోజు జిల్లా పరిషత్ హైస్కూల్లో బాల బాలికలకు 500 టైలు, 500 బెల్టులు, 500 బ్యాచిలు, 100 మంది బాలబాలికలకు బస్ పాసు లు  పంపిణీ చేశామని అన్నారు. రాబోయే రోజుల్లో మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారి ఉన్నత చదువులకు ఖర్చయ్యే డబ్బులు మా ట్రస్టు ద్వారా చెల్లిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బొడిగ బాలయ్య ట్రస్ట్ అధ్యక్షులు బొడిగ రాజు గౌడ్
 

ఎస్సై శేఖర్, ఎస్సై నర్సింగ్ రావు, హైచ్ ఎం శోభ, విజయ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.