బాలాజీ దేవాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే దంపతుల  ప్రత్యేక పూజలు 

బాలాజీ దేవాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే దంపతుల  ప్రత్యేక పూజలు 

దుబ్బాక,ముద్ర: ఆషాడ శుద్ధ తొలి ఏకాదశిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దుబ్బాక లోని శ్రీ బాలాజీ దేవాలయంలో స్థానిక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు మంజుల దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఎమ్మెల్యే దంపతులకు ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే దంపతులను ఆలయ అర్చకులు ఈ సందర్భంగా ఆశీర్వచనం చేశారు.