అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ

అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ
  • కలెక్టరేట్లో అమరుల కుటుంబాలకు సన్మానం
  • కుటుంబీకులతో కలిసి  భోజనాలు చేసిన ఎమ్మెల్యే ,కలెక్టర్,జెడ్పి చైర్మన్

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:-తెలంగాణ కోసం ఉద్యమంలో ముందుండి పోరాడి ప్రాణ త్యాగం చేసిన అమరుల వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని పలువురు వక్తలు కొనియాడారు. గురువారం నాడు సిద్దిపేట కలెక్టరేట్లో అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు అమరవీరుల ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ మౌనం పాటించారు. అమరవీరుల కుటుంబీకులతో కలిసి జిల్లా యంత్రాంగం నేతలు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,జెడ్పి చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితల సతీష్ కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఆర్ఓ లక్ష్మీ కిరణ్, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్, డి పి ఆర్ ఓ రవీందర్ పలువురు జడ్పిటిసిలు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.