టైర్ పేలి కారు బోల్తా ఒకరు మృతి

టైర్ పేలి కారు బోల్తా ఒకరు మృతి

తూప్రాన్:ముద్ర:జాతీయ రహదారిపై వెళ్తున్న కారు టైర్ పెలడంతో  బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన తూప్రాన్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో శుక్రవారం చోటుచేసుకుంది. ఆల్టో కార్ టైర్ పెలడంతో కారు డివైడర్ ను ఢీకొని ప్రమాదం జరగగా కారులో ప్రయాణిస్తున్న నిజామాబాద్ జిల్లా మెండోర్ మండలం దూర్గాన్ గ్రామానికి చెందిన పడిగెల బాపయ్య( 64) మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారి స్వగ్రామం నుండి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతుడికి ఇటీవలే హార్ట్ ఆపరేషన్ కాగా చికిత్స కోసం కుమారుడు కూతురుతో కలిసి అస్పత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి తూప్రాన్ డిఎస్పీ యాదగిరి రెడ్డి, ఎస్.ఐ సురేష్ కుమార్ లు చేరుకొని మృత దేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు.