చీకోటి ప్రవీణ్, మరో ఇద్దరికి ఈడీ నోటీసులు
హైదరాబాద్లోని బడా బాబులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. చీకోటి ప్రవీణ్, నసీర్, మోసీన్లకు నోటీసులు ఇచ్చింది. లగ్జరీ కార్లు కొనుగోలు చేసి పన్నులు ఎగ్గొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. కార్లను బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 15న చీకోటి ప్రవీణ్ను ఈడీ విచారిస్తుంది.