కుమారి ఆంటీ డైలాగ్ తో వాహనదారులకు షాక్ ఇస్తున్న సిటీ పోలీసులు...

కుమారి ఆంటీ డైలాగ్ తో వాహనదారులకు షాక్ ఇస్తున్న సిటీ పోలీసులు...

ముద్ర,హైదరాబాద్:- సామాజిక మాధ్యమాల్లో ఇటీవల సెన్సెషన్ క్రియేట్ చేసిన డైలాగ్ "మీది మొత్తం వెయ్యి అయ్యింది. రెండు లివర్లు ఎక్స్ ట్రా" అంటూ గచ్చిబౌలిలో భోజన హోటల్ నడుపుతున్న కుమారి ఆంటీ డైలాగ్ ఇది. ఈ ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాను షేక్ చేశారు కుమారి ఆంటీ. హైదరాబాద్ సిటీ పోలీసులుఈ డైలాగ్ తో నిర్లక్ష్యంగా వ్యవహరించే వాహనదారులను అలర్ట్ చేశారు.

హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడుపుతున్న ఓ వాహనదారుడి ఫొటోను హైదరాబాద్ సిటీ పోలీసులు ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీనికి క్యాప్షన్ గా " మీది మొత్తం వెయ్యి అయ్యింది. యూజర్ ఛార్జెస్ ఎక్స్ ట్రా" అంటూ ట్వీట్ చేశారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం, ట్రాఫిక్ నియమాలను పాటించండి, సేఫ్ డ్రైవింగ్ చేయండని పోలీసులు యాష్ ట్యాగ్ లు జోడించారు. సిటీ పోలీసుల వినూత్న ప్రయత్నంపై నగర వాసులతో పాటు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.