ఉచితంగానే గ్రూప్-1 పేపర్ దొరికేసిందంట!
''మా ఆవిడ టీఎస్పీఎస్సీ ఉద్యోగి. ఆమె ద్వారా ప్రవీణ్ పరిచయం. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని ప్రవీణే అందజేశాడు. అయితే.. అందుకు సంబంధించి ఎలాంటి సొమ్ము చెల్లించలేదు'' అని టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు లో 10వ నిందితుడిగా ఉన్న షమీమ్ సిట్ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ కేసుతో ప్రమేయమున్న నిందితుల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ లో షమీమ్కే అత్యధికంగా 127 మార్కులు వచ్చినట్లు ఇప్పటికే సిట్ నిర్ధారించింది. షమీమ్ శంషాబాద్లోని ఓ ల్యాబ్లో పనిచేస్తున్నాడు. ఆయన భార్య 2013 గ్రూప్-2లో ఉద్యోగం సాధించి, ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో గ్రూప్-4 పరీక్షల విభాగం సెక్షన్ అధికారిగా పనిచేస్తున్నారు. దాంతో సిట్ అధికారులు ఎల్బీనగర్లోని గుంటి జంగయ్య కాలనీలోని షమీమ్ ఫ్లాట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది.