జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలన

జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలన

అధికారులతో సమీక్షించిన ప్రకాశ్​జవదేకర్, బండి సంజయ్ 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎన్​హెచ్ ​765 డీజీ నిర్మాణ పనులను కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు ప్రకాశ్​జవదేకర్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్​ కుమార్​ సోమవారం  పరిశీలించారు. సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామం వద్ద జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు ప్రభాకర్ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.