సీఎం కెసిఆర్ ఇలాకా లో కేంద్రమంత్రి పర్యటన

సీఎం కెసిఆర్ ఇలాకా లో కేంద్రమంత్రి పర్యటన

యువతరం అంత మోడీ వైపే చూస్తున్నారని కేంద్ర మంత్రి వ్యాఖ్య

ముద్ర ప్రతినిధి సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని దుద్దెడ, కుక్కునూరు పల్లి, ప్రజ్ఞాపూర్ ,గజ్వేల్, భావానందపూర్, వర్గల్ తదితర ప్రాంతాల్లో కేంద్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించారు. మహా జన సంపర్క్ అభియాన్ పేరుతో భారతీయ జనతా పార్టీ చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. ప్రజ్ఞాపూర్ లో పార్టీ సీనియర్ నేతలతో పాటు పలువురు ప్రముఖులను గజ్వేల్ లో న్యాయవాదులను కలిసి కేంద్రమంత్రి మాట్లాడారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యువత నరేంద్ర మోడీ వైపే చూస్తున్నదని చెప్పారు 9 సంవత్సరాలలో మోడీ అందించిన అవినీతి రహిత పరిపాలన పట్ల యువత ఆకర్షితులయ్యారని వచ్చే ఎన్నికల్లో యువత మోడీ వైపే ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, భాజపా నేతలు పాల్గొన్నారు