కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న కలెక్టర్ దంపతులు

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న కలెక్టర్ దంపతులు
  • పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు
  • అభివృద్ధిలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందన్న కలెక్టర్

ముద్ర ప్రతినిధి:సిద్దిపేట:-తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా అధ్యాత్మిక దినోత్సవం పురష్కరించుకుని జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ సాంప్రదాయం ప్రకారం  పూజలో పాల్గొని మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా కలెక్టర్ సతీ సమేతంగా శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగానికి చేరగా ఆలయ పాలకవర్గ సభ్యులు కలెక్టర్ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు.డప్పు వాయిద్యాల సన్నాయి మేళాల నడుమ పూర్ణకుంభంతో వేద పండితులు వారిని ఆలయంలోకి తిసుకేళ్ళారు. ముందుగా వేద పండితులు నిర్వహించిన రుద్రహోమంలో కలెక్టర్ పాల్గోన్నారు.

తర్వాత 108 కలశాలతోటి ఏర్పాటు చేసిన కలశ పూజను జ్వోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ద్వారా ప్రత్యేక ఆశీర్వచనాలు అందుకున్నారు. మల్లికార్జున స్వామి ఎంతో విశిష్టమైన పట్నం పూజలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ మాట్లాడుతూ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం శుభాకాంక్షలు తెలిపారు.అధ్యాత్మిక దినోత్సవం పురష్కరించుకుని రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ట గల  కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.మంత్రి హరీష్ రావు మార్గనిర్దేశంతో జిల్లా రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంది. సాగు,తాగు నీటికి ఎలాంటి కోరత లేకుండా రిజర్వాయర్ల ఖిల్లా మన జిల్లా మారిందని అన్నారు. జిల్లాలో ప్రజలందరూ  ఆయురారోగ్యాలు అష్టా ఐశ్వర్యలతో, సుఖశాంతులతో వర్థిల్లాలని దేవున్ని  కోరినట్లు తెలిపారు. జిల్లాను ప్రగతి పథంలో నడపడానికి కృషి చేస్తున్న ప్రతి ఓక్కరికి జిల్లా పాలన యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలిపారు.కలెక్టర్ వెంట ఆలయ ఈఓ బాలాజి,చైర్మన్ గిస బిక్షపతి,మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.