సద్గురువులను సముదాయించి దీక్ష విరమింపజేసిన ప్రముఖులు

సద్గురువులను సముదాయించి దీక్ష విరమింపజేసిన ప్రముఖులు

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: సమస్యల పరిష్కారానికై ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సద్గురువులు ఇద్దరినీ జిల్లాకు చెందిన ప్రముఖులు సముదాయించి వారిచే దీక్ష విరమింప చేశారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం వెలుకటూరు గ్రామంలోని గోకులా ఆశ్రమంలో శ్రీ వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్టు వ్యవస్థాపకులు, సద్గురువులు. డాక్టర్ వై. మధుసూదన్ ఆర్యులు , డాక్టర్ వై. సరలాదేవిలు ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం ముద్రపాఠకులకు విధితమే, మంగళవారము ముద్రలో వచ్చిన ప్రత్యేక కథనానికి స్పందించిన అధికార పార్టీ జిల్లా నేత జాప శ్రీకాంత్ రెడ్డి, మంత్రి హరీష్ రావు ఓ ఎస్ డి బాలరాజు, వెల్కటూర్ గ్రామ సర్పంచ్ అశోక్, మాజీ సర్పంచ్ కనకయ్య  సిద్దిపేట త్రీ టౌన్ ఎస్ఐ సంపత్ తదితరులు వెలుకటూరులోని గోకులాశ్రమానికి వెళ్లి సద్గురువులను కలిశారు.

వారి డిమాండ్లను సావధానంగా విని అతి త్వరలో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వయసు రీత్యా పెద్దవారైనందున దీక్షను వెంటనే విరమించాలని విజ్ఞప్తి చేశారు .దీనికి సానుకూలంగా స్పందించిన సద్గురువులు సోమవారం వరకు సమస్యను పరిష్కరింపజేయాలని సూచించారు. అప్పటివరకు కేవలం పండ్ల రసాలు మాత్రమే తీసుకోవడానికి అంగీకరించారు దాంతో వారిచే ఆమరణ నిరాహార దీక్షను నాయకులు విరమింప చేశారు.