దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ  సురక్ష దినోత్సవం

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ  సురక్ష దినోత్సవం
  • సిద్దిపేటలో సిపి నేతృత్వంలో భారీ ర్యాలీ
  • ర్యాలీని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ముద్ర  ప్రతినిధి, సిద్ధిపేట: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం సిద్ధిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట లోని బీజేఆర్ చౌరస్తా నుంచి పట్టణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు పోలీస్ కమిషనర్ నేరెళ్లపల్లి శ్వేతారెడ్డి నేతృత్వంలో జరిగిన మోటార్ సైకిల్, పెట్రో కారు, పోలీస్, అగ్నిమాపక వాహనాల ర్యాలీని  రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు, జెండా ఊపి ప్రారంభించారు.

సిద్ధిపేట  జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఏసీపీలు డీసీపీలు జిల్లాలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐలు, అగ్నిమాపక సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.