స్కూటీ నీ ఢీకొట్టిన డిసిఎం వ్యాన్ వ్యక్తి
![స్కూటీ నీ ఢీకొట్టిన డిసిఎం వ్యాన్ వ్యక్తి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6463b0731f250.jpg)
- పరిస్థితి విషమం
- కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రికి తరలింపు
ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సమీపంలోని సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై స్కూటీని డీసీఎం వ్యాన్ నెంబర్ AP V 6139 మంగళవారం ఢీకొన్నది.ఈ సంఘటనలో AP 15 BB 55 46 నెంబర్ గల స్కూటీ పై వెళ్తున్న డయాల్ సిస్ పేసెంట్ మీసం లక్ష్మణ్ (58 ) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు ఈ సంఘటనలో ఆయన ఎడమ చేయి విరిగి తలకు కాళ్లకు చేతులకు బలమైన గాయాలయ్యాయి. ఆ సమయంలో సంఘటన స్థలం నుంచి కారులో వెళుతున్న బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి 108 అంబులెన్స్ వారికి సమాచారం అందించారు.
108 అంబులెన్స్ వారు సంఘటన స్థలానికి రాగానే క్షతగాత్రున్ని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు అతని పరిస్థితి విషమంగా ఉండడంతో లక్ష్మన్ ను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ ఆసుపత్రికి అంబులెన్స్ లో పంపారు.ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని స్క్రూట్ ని ఢీకొట్టి డీసీఎం వ్యాన్ తో పరారైన డ్రైవర్ కోసం ఎస్సై శేఖర్ ఆరా తీస్తున్నారు.