మంత్రి కేటీఆర్,జెడ్పిటిసి సహకారంతో హైమాస్ లైట్లు

మంత్రి కేటీఆర్,జెడ్పిటిసి సహకారంతో హైమాస్ లైట్లు
  • ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం

ముద్ర,ఎల్లారెడ్డిపేట:మంత్రి కేటీఆర్, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు సహకారంతో హైమాస్ లైట్లు ప్రారంభించుకోవడం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాలలో హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు తో విన్నవించగా జెడ్ పి టి సి మంత్రి కేటీఆర్ సహకారంతో గురువారం గురుకుల పాఠశాలలో హైమాస్ లైట్లను  ఏర్పాటు చేయడం జరిగిందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు బంజారా సేవా సంఘం వారు తెలిపారు.