పెరుమాండ్ల సంకీసలో క్షుద్రపూజల  కలకలం

పెరుమాండ్ల సంకీసలో క్షుద్రపూజల  కలకలం

ముద్ర ప్రతినిధి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరమాండ్లసంకీస గ్రామంలో క్షుద్రపూజలు సోమవారం కలకలం సృష్టించాయి. పెరుమాండ్లసంకీస గ్రామానికి చెందిన కిన్నెర మధు అనే వ్యక్తి ఇంటి ఎదుట క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి. పసుపు కుంకుమ ఇతర వస్తువులను వీధిలో ఉంచడంతో స్థానికులు భయభ్రాంతులవుతున్నారు. రాత్రి 10 గంటల వరకు తాము చూసామని ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని, కానీ తెల్లవారేసరికి ఈ ఆనవాళ్లు కనిపించాయని వారు వాపోయారు. కావాలనే కొందరు వ్యక్తులు గ్రామంలో ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మూడనమ్మకాల పట్ల ప్రజలు ఎవరు అధైర్య పడవద్దని డోర్నకల్ సిఐ వెంకటరత్నం తెలిపారు.