తెగిపడిన విద్యుత్ వైర్లు తగిలి గాయపడిన గీతా కార్మికుడు

తెగిపడిన విద్యుత్ వైర్లు తగిలి గాయపడిన గీతా కార్మికుడు

 ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్ పూర్ గ్రామానికి చెందిన కందుకూరి శ్రీనివాస్ గౌడ్ 45 అనే గీతా కార్మికుడు బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో విద్యుత్ వైర్లు తెగి నేలపై పడిపోయి ఉన్న వైరు ద్విచక్ర వాహనంకు తగిలి కింద పడిపోయాడు . ఈ సంఘటన లో ఆయన కుడి చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డాడు.బ్రతుకు దెరువు కోసం  శ్రీనివాస్ గౌడ్ ప్రతి రోజు తాటి చెట్లు ఎక్కి కల్లు తీసుకుని అవసరమైతే కల్లు అమ్ముకొని ఒక వేళ అమ్మకపోతే ఇంటి దగ్గర పెట్టి ఉపాధి హామీ పనులకు వెళ్ళుతుంటాడు.

ఎప్పటిలాగేతన ద్విచక్ర వాహనం పై  పెద్దవేణి ఎల్లయ్య వ్యవసాయ బావి దగ్గర జరిగిన సంఘటనలో శ్రీ నివాస్ గౌడ్ కుడిచేయి విరిగి గాయపడ్డాడు. వెంటనే గ్రామస్తులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి వచ్చి  అతన్ని  మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ కు చేతు విరిగి గాయపడిన అతనికి సెస్ సంస్థ తరుపున ఆర్థీక సహాయం అందించాలని గౌడ సంఘం ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.