సాగునీరు అందాక రైతులు కష్టాలు పడుతుంటే పట్టించుకోని ఎమ్మెల్యే

సాగునీరు అందాక రైతులు కష్టాలు పడుతుంటే పట్టించుకోని ఎమ్మెల్యే

ముద్ర.వీపనగండ్ల: చిన్నంబాయి మండలంలోని చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న ఎమ్మెల్యే బీరం ఏమాత్రం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు అన్నారు. చిన్నంబాయి మండలం పెద్ద మారుర్ పెంట్ల్లవేల్లి మండలం గోఫ్లాపూర్ గ్రామాలలో   మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఆనాడు ఎవరు అడగకపోయినా చిన్నంబావి నీ మండల కేంద్రంగా చేశానని,దాని వల్ల నేడు చుట్టూ పక్కల గ్రామాలకు అభివృద్ది పరంగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుందన్నారు.మండల రైతులు చివరి ఆయకట్టుకు సాగునీరు అందక ఇబ్బందులు పడినప్పుడు పట్టించుకోని హర్షవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడు అని విమర్శించారు.మళ్ళీ ఇలాంటి మాయగల్లకు ఓట్లు వేస్తే నేను కోనసీమ గా మార్చిన కొల్లాపూర్ ను ఎడారి గా మర్చుతాడు అని కావున ప్రజలు ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉండి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనీ గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరోగ్యారెంటీలను అమలు చేసి ప్రజలకు అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్. పగిడాల శ్రీనివాస్ గారు మరియు ఏఐసీసీ జాతీయ ఓబీసీ కో ఆర్డినేటర్ డా. కేతూరీ వెంకటేష్ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్,నాయకులు ఈదన్న,భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.