కొత్త నూతి జలదిగ్బంధం
- అంబేద్కర్ విగ్రహాన్ని తాకిన వరద నీరు
- డివైడర్ కు జెసిబి సహాయంతో గండి కొట్టిన నాయకులు
ముద్ర,ఎల్లారెడ్డిపేట: కొత్త నూతి జలదిగ్బంధంలో మునిగిపోయింది. ఎడతెరపు లేకుండా కురుస్తున్న అకాల వర్షానికి గురువారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం కిషన్ దాస్ పేటలోని ఉన్న తిమ్మాస్ కుంటకు గండి పడడంతో వరద నీరు ఒక్కసారిగా లోతట్టు ప్రాంతం గుండా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని ఉన్న కొత్త నూతి పూర్తిగా వరదలో నీట మునిగి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్దకు నీరు చేరుకుంది.
రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్ అడ్డుగా ఉండడంతో నీరు కింది ప్రాంతానికి వెళ్లేటట్లు నాయకులు సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షులు నెవూరి శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్, ఎనగందుల నర్సింలు తదితరులు పాల్గొని జెసిబి సహాయంతో డివైడర్ను గండి కొట్టి నీటిని పంపించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వర్షానికి లెక్కచేయకుండా పార్టీలకు అతీతంగా గ్రామ రక్షణలో భాగస్వాములుగా అయినటువంటి నాయకులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.