బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి
![బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_652fcefa0c5ec.jpg)
- గర్జనపల్లి నుండి ప్రగతి భవన్ కు పాదయాత్ర
- అజ్మీర నవీన్ నాయక్
ముద్ర,ఎల్లారెడ్డిపేట :భారత రాష్ట్ర సమితి మళ్లీ అధికారంలోకి రావాలని ఓ యువకుడు బీఆర్ఎస్ జెండాను పట్టుకొని పాదయాత్రగా వీర్నాపల్లి మండలం గర్జనపల్లి నుండి ప్రగతి భవన్ కు వెళ్తున్నాడు. వీర్నాపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన అజ్మీర నవీన్ నాయక్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం మళ్లీ గెలవాలని ఆకాంక్షిస్తూ బుధవారం గర్జనపల్లి నుండి ఎల్లారెడ్డిపేట మీదుగా ప్రగతి భవన్ కు పాదయాత్రగా వెళ్తున్నాడు. తనకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి స్వాగతం పలుకుతూ తన పాదయాత్ర సజావుగా జరగాలని మంత్రి కేటీఆర్ సహాయకులకు చరవాణి ద్వారా సమాచారం అందిస్తానని పేర్కొన్నారు.