తెలంగాణ లో ఒడిషా బృందం పర్యటన...
![తెలంగాణ లో ఒడిషా బృందం పర్యటన...](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_6509984131c62.jpg)
- నాఫ్స్ కాబ్ చైర్మన్ రవీందర్ రావు ను కలసిన ఒడిషా మంత్రి..
ముద్ర,గంభీరావుపేట: తెలంగాణ రాష్ట్రంలో సహకార సంఘాల సక్సెస్ పై ఒడిషా సహకార మంత్రి అటాను సభ్య సచినాయక్ ఆద్వర్యంలో బృందం రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. అందులో బాగంగా టెస్కాబ్ కార్యాలయంలో నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు,ఒడిషా సహకార మంత్రి అటాను సభ్య సచినాయక్ లు తెలంగాణ లో సహకార సంఘాల సక్సెస్ పై చర్చించారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలకు అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహం, జిల్లాలో సహకార సంఘంలో వినియోగిస్తున్న టెక్నాలజీ, హెచార్ పాలసీ, పరిపాలన,సంఘ సభ్యులకు అందిస్తున్న సేవలు మొదలగు అంశాలపై రవీందర్ రావు ఒడిషా బృందానికి వివరించారు. సిఎం కేసీఆర్ సహకరాంతోనే తెలంగాణ సహకార వ్యవస్థ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని రవీందర్ రావు అన్నారు. ఈ సమావేశంలో టెస్కాబ్ ఎండీ మురళీధర్, ఒడిషా బృందం పాల్గొన్నారు.