ప్రజా కళాకారులుకారుపోతులఅంజన్నఆశయ సాధనకై కృషి చేయాలి - సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

ప్రజా కళాకారులుకారుపోతులఅంజన్నఆశయ సాధనకై కృషి చేయాలి - సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ప్రజా కళాకారులు, కారిపోతుల అంజన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో  ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు అమరజీవి  కారు పోతుల అంజన్న 28వ వర్ధంతిని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ  జిల్లాలో ప్రజానాట్యమండలి నిర్వహించిన  అక్షర కళాయాత్రలో 5000 మంది కళాకారులను తయారుచేసి రాష్ట్రవ్యాప్తంగా కళా ప్రదర్శన లు నిర్వహించిన ప్రజా కళాకారులు కారు పోతుల అంజన్న అన్నారు. అప్పటి తెలుగు రాష్ట్రాలలోనే కాక ఇతర రాష్ట్రాలలో కళా ప్రదర్శనలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న మాట్లాడుతూ తన ఆటపాట ద్వారా ప్రజలను చైతన్యపరిచిన  గొప్ప కళాకారుడుఅంజన్న అన్నారు. అంజన్న జీవితాన్ని నేటి కళాకారులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరంఅంజన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, ఐద్వా జిల్లా కార్యదర్శి  మేఘన బోయిన సైదమ్మ, పట్నం జిల్లా కార్యదర్శి జిల్లా పల్లి నరసింహారావు,జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి,సిఐటియు జిల్లా నాయకులు మేకన పోయిన శేఖర్, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు పోలేపాక శీను,యాతాకుల ప్రవీణ్, నాయకులు చిన్నపంగా నరసయ్య తదితరులు పాల్గొన్నారు.