జులై 14 నుంచి ఓటీటీలో‘మాయాబజార్ ఫర్ సేల్’

జులై 14 నుంచి ఓటీటీలో‘మాయాబజార్ ఫర్ సేల్’

జీ5...మ‌న దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతూ అతి పెద్ద డిజిట‌ల్ మాధ్య‌మంగా అవ‌త‌రిస్తోంది. వైవిధ్యమైన కంటెంట్‌ను ప‌లు భాష‌ల్లో అందిస్తూ త‌నదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న జీ 5 త్వరలోనే ‘మాయాబజార్ ఫర్ సేల్’  అనే స‌రికొత్త మ‌ల్టీస్టార‌ర్ తెలుగు వెబ్ ఒరిజిన‌ల్‌ను అందించనుంది. వివిధ కథ, కథనాల ద్వారా సెటైరికల్ డ్రామాగా రూపొందుతోన్న మాయాబజార్ ఫర్ సేల్ వెబ్ సిరీస్ గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో రూపొందుతోంది. జీ 5తో పాటు రానా ద‌గ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యాన‌ర్ క‌లిసి సునిశిత‌మైన‌, హృద్యమైన డ్రామాగా మాయాబ‌జార్ ఫ‌ర్ సేల్‌ను రూపొందిస్తున్నారు. ఇదొక గేటెడ్ క‌మ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్‌కు రైట‌ర్‌, డైరెక్టర్‌గా గౌత‌మి చ‌ల్లగుల్ల వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజీవ్ రంజ‌న్ నిర్మాత‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. పాస్ట్రీ, గాంధీ, హిప్పీ, బ్యాచిల‌ర్స్‌, ప్రేమికుల జంట ఇలా ప‌లు ర‌కాలైన కుటుంబాల‌న్నీ క‌లిసి ఓ గేటెడ్ క‌మ్యూనిటీలో ఉంటాయి. అలాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉండే విలక్షణ‌మై కుటుంబాల మ‌ధ్య ఉండే నాట‌కీయ‌త‌ను మాయాబజార్ ఫ‌ర్ సేల్‌ సిరీస్‌లో ఆవిష్కరించ‌బోతున్నారు. నేటి అధునిక స‌మాజంలో కుటుంబాలు ఎలా ఉన్నాయ‌నే వాటితో పాటు సామాజిక జీవన విధానం ఎలా ఉంద‌నే విష‌యాల‌ను మాయాజ‌బార్ ఫ‌ర్ సేల్ ఒరిజిన‌ల్‌లో వ్యంగంగా, హాస్యాన్ని క‌ల‌బోసి చూపించ‌బోతున్నారు. ఇందులో న‌వ‌దీప్, ఈషా రెబ్బా, న‌రేష్ విజ‌య్ కుమార్‌, హ‌రితేజ‌, ఝాన్సీ ల‌క్ష్మీ, మియాంగ్ చంగ్‌, సునైన‌, కోట శ్రీనివాస‌రావు త‌దిత‌రులు త‌మ‌దైన అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రాణం పోశారు. త్వ‌ర‌లోనే ఈ సెటైరిక‌ల్ డ్రామా జీ5లో స్ట్రీమింగ్ కానుంది.