19 ఏళ్ళ బాలిక  ఆరోగ్యానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

19 ఏళ్ళ బాలిక  ఆరోగ్యానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి ,నాగర్ కర్నూల్ జిల్లా: తస్నేం ఫిర్దొస్ ఖతోన్ కి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ కోసం 5 లక్షల రూపాయల LOC అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. నాగర్ కర్నూల్ పట్టణంలోనీ 14వ వార్డుకు చెందిన ఎండి కాశిం ఖాన్  19 ఏళ్ళ కుమార్తె తస్నేం ఫిర్దొస్ ఖతోన్ ఇటీవల అనారోగ్యంతో హాస్పటల్ లో చేరడంతో ఆమెకు అన్ని పరీక్షలు నిర్వహించిన వెంటనే డాక్టర్స్ బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్  చేయాలనీ సూచించడంతో వారి ఆర్థిక ఇబ్బందుల వాళ్ళ ఆపరేషన్ చేయించుకొని పరిస్థితుల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఆ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ కోసం 5 లక్షల రూపాయల LOC మంజూరు చేపించి ఈరోజు అమ్మాయి కుటుంబ సభ్యులను అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.