ఎంపీ కోలుకోవాలని చర్చిలో ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే పద్మ

ఎంపీ కోలుకోవాలని చర్చిలో ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్: దాడిలో గాయపడిన మెదక్ ఎంపీ, దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి  ఆరోగ్యం త్వరగా కోలుకొని ఎమ్మెల్యే  పద్మాదేవేందర్ రెడ్డి  మంగళవారం మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేశారు.   ప్రజలతో ఎప్పుడు కలిసి మెలిసి ఉంటూ వారి కష్ట, సుఖాల్లో  పాలుపంచుకుంటున్న  ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజల్లోకి వెళ్లాలని  భగవంతున్ని కోరుకున్నట్లు చెప్పారు. ఈ ప్రార్థనల్లో నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్  మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు  ఆర్కే శ్రీనివాస్, మామిళ్ళ ఆంజనేయులు, మేడి మధుసూదన్ రావు, శ్యాం సుందర్, సాంసన్ సందీప్, జుబేర్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రామాలయంలో పూజలు
ఎంపీ ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ మెదక్  కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ నియోజకవర్గం ఇంచార్జి తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, నాయకులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పిట్లంబేస్ లో ఉన్న దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వాహించారు. ఎంపీ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంగా రావాలని ఆకాంక్షించారు.