తగ్గేదేలే...! ప్రభుత్వ హెచ్చరికలకు భయపడని జెపిఎస్ లు 12వ రోజుకు చేరిన సమ్మె

తగ్గేదేలే...! ప్రభుత్వ హెచ్చరికలకు భయపడని జెపిఎస్ లు 12వ రోజుకు చేరిన సమ్మె

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రభుత్వ హెచ్చరికలకు ఏమాత్రం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆదరలేదు...బెదరలేదు... తగ్గలేదు. మంగళవారం సాయంత్రం వరకు విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించినా ఏమాత్రం తగ్గేదేలేదంటున్నారు. మెదక్ కలెక్టరేట్ ముందు సమ్మె శిబిరంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కూర్చున్నారు. సమ్మె 12వ రోజుకు చేరింది. జీవో రావాలి, జిపికి పోవాలి అనే నినాదంతో సమ్మెలో బీష్మించుకుకూర్చున్నారు.  జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మెదక్ జిల్లా అధ్యక్షుడు కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి, నాయకులు నాగరాజు, సునంద, రాణి, నందిని, అఖిఫ్, ప్రశాంత్, ప్రమోద్, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.