3 వేలకు చేరువైన మొరాకో భూకంప మృతుల సంఖ్య

3 వేలకు చేరువైన మొరాకో భూకంప మృతుల సంఖ్య

మొరాకోలోని అట్లాస్‌ పర్వతాల్లో 6.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భూకంపం ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ కుప్పలుగా శవాలు బయటపడుతున్నాయి. ఈ శక్తిమంతమైన  భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 3,000 చేరువైంది.
స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుల సంఖ్య 2,862కు చేరింది. ఇక ఈ విపత్తుకు 2,500 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 100 మంది మొరాకో రక్షణ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటోంది.