మహదేవపూర్ ఎంపీపీ పై అవిశ్వాసం

మహదేవపూర్ ఎంపీపీ పై అవిశ్వాసం

మహాదేవపూర్, ముద్ర: మహదేవపూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి బాన్సోడ రాణి బాయి పై ఆరుగురు ఎంపిటిసిలు సంతకాలు చేసి భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్ కు అవిశ్వాసం నోటీసును అందజేశారు. జూలై 5 తో నాలుగు సంవత్సరాల పదవీకాలం పూర్తి కావడంతో ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. పంచాయతీరాజ్ చట్టం  ప్రకారంగా నాలుగు సంవత్సరాల పదవి కాలం తర్వాతే అవిశ్వాసాన్ని ప్రతిపాదించాల్సి ఉంది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారిలో బంధం పుష్పలత (బొమ్మపూర్), చల్లా రమణ( మహాదేవపూర్3 ఎంపిటిసి), రేవల్లి మమత( కాలేశ్వరం), చల్ల పద్మ (బెంగుళూరు), మడక తిరుమల (సూరారం), బీసుల జయశ్రీ (అంబటిపళ్లి) ఎంపీటీసీలు సంతకాలు చేసి తీర్మానాన్ని ఆర్డిఓకు అందజేశారు. వీరి వెంట పిఎసిసిఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు, రైతు సమన్వయ సంఘం అధ్యక్షులు బండం లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. ఎంపీటీసీలు అందర్నీ వీరు క్యాంపుకు తరలించారు.