ఐపీఎల్​లో​‘ఊ అంటావా.. ఊహు అంటావా’

ఐపీఎల్​లో​‘ఊ అంటావా.. ఊహు అంటావా’
  • అభిమానులను ఉర్రూతలూగించిన రష్మిక, తమన్న, అర్జిత్​సింగ్​
  • గ్రాండ్​గా ప్రారంభమైన వేడుకలు

అహ్మాదాబాద్​: ఇండియన్ ప్రీమియర్ లీగ్-- -2023 మెగా టోర్నీ 16వ సీజన్‌ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సినీనటుల ప్రదర్శనలతో ఆద్యంతం అభిమానులను అలరించింది. మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య నరేంద్ర మోదీ స్టేడియం స్టేడియం పరిసరాలు తళుక్కుమన్నాయి. గ్రాండ్​గా ప్రారంభోత్సవ వేడుక.. ఐపీఎల్ -16 సీజన్ ఆరంభ వేడుకలు అహ్మదాబాద్​ని నరేంద్ర మోదీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ప్రముఖ సింగర్​ అర్జిత్ సింగ్ తన గాత్రంతో ప్రేక్షకులను మైమరపించి అభిమానుల్లో ఫుల్​ జోష్​నింపాడు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరగలేదు. దీంతో ఈ సారి ప్రారంభోత్సవాన్ని అదిరేలా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ఈ ఆరంభ వేడుకలకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా హాజరయ్యారు. ఇక హీరోయిన్​ రష్మిక మంధాన పుష్ప సినిమాలోని 'సామి సామీ', 'శ్రీ వల్లి' పాటలకు అదిరిపోయే స్టెప్పులేసి ఫ్యాన్స్​లో జోష్ నింపింది. 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటకు నృత్యం చేసి అలరించింది. మరో హీరోయిన్​ తమన్న భాటియా సందడి చేసింది. వివిధ భాషల పాటలకు డ్యాన్స్​ చేస్తూ.. ప్రేక్షకులను ఈ సినీరంగానికి చెందిన ముద్దుగుమ్మలు అలరించాయి. టాలీవుడ్ సినిమా 'పుప్ప'లోని 'ఊ అంటావా మావ' పాటకు చిందులేయగా స్టేడియం మొత్తం హోరెత్తింది.