సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం


ముద్ర ప్రతినిధి, బోడుప్పల్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 22 శాతం ఫిట్ మెంట్ ప్రకటించిన సందర్భంగా టీఎస్ ఆర్టీసీ కార్మికులతో కలిసి మేడ్చల్ నియోజకవర్గం ఇన్ ఛార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ఉమ్మడి మేడ్చల్ మండలం బస్సు డిపో ఎదురుగా సీఎం చిత్రపటంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రాలకు పాలతో అభిషేకించారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు హరివర్థన్ రెడ్డి కూడా పాలతో వారి చిత్రపటాలను అభిషేకించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన ఉమ్మడి మేడ్చల్ మండల్, మున్సిపాలిటీ శాఖల అధ్యక్షులు, ప్రదాన కార్యదర్శులు, కౌన్సిలర్లు, యూత్, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, ఓబీసీ సెల్, ఎస్సీ, ఎస్సీ మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.