సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
లోకేశ్వరం ముద్ర: లోకేశ్వరం మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయటం హర్షనీయమని అన్నారు. ఈ రుణమాఫీ వలన రైతు కండ్లల్లో ఆనందం కనిపిస్తుంది అన్నారు. అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు, ఈ పథకాల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో లాభం చేకూర్చిందన్నారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, ఆసరా పింఛన్లు ఇలా అనేక పథకాలు ప్రవేశపడం వల్ల ప్రజలకు మేలు జరిగిందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ ,ఎంపీపీ లలిత భోజన్న ,బిఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యామ్ సుందర్ , పిఎసిఎస్ మాజీ చైర్మన్ చిన్న రావు , సర్పంచులు, కపిల్ , లక్ష్మణ్ పటేల్ , ముత్తన్న , దిగంబర్ , రమణా రెడ్డి ,మాజీ సర్పంచ్ శ్రీధర్ , సుదర్శన్ రెడ్డి , ఎంపీటీసీ గంగాధర్ , మాజీ ఆత్మ చైర్మన్ రవీందర్ రావు , పిఎసిఎస్ డైరెక్టర్ సుధీర్ రెడ్డి ,బిఆర్ఎస్ సోషల్ మీడియా మండల కన్వీనర్ బండి ప్రశాంత్ ,బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భోజా రెడ్డి గ, బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సాయ రెడ్డి , బిఆర్ఎస్ నాయకుడు పేట సుధాకర్ మరియు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.