ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం
లోకేశ్వరం, ముద్ర : లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్ లో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో మరియు భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది. తదనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ యొక్క జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సురేందర్ మరియు దోమల భోజన్న మహేందర్ రెడ్డి సుమన్ కుమార్ శ్రీకాంత్ గౌడ్ మహేష్ గౌడ్ సాతిరి శ్రీధర్ సాయికుమార్ రవీందర్ గంగా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.