మహాధర్నా పోస్టర్ల ఆవిష్కరణ

మహాధర్నా పోస్టర్ల ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే మహాధర్నా పోస్టర్లను మంగళవారం నిర్మల్ లో ఆవిష్కరించారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యు టి ఎఫ్ జిల్లా కార్యదర్శి పెంట అశోక్ మాట్లాడుతూ పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, పీఆర్సీ అమలు చేసేవరకు మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదోన్నతులు,బదిలీలు వెంటనే చేపట్టి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని కోరారు. సమస్యల సాధనకు ఈ నెల 12న జిల్లా స్థాయిలో, వచ్చే నెల 1 న రాష్ట్ర స్థాయిలో మహా ధర్నా నిర్వహించ నున్నట్లు పేర్కొన్నారు.