ఘనంగా ఆంజనేయుని ర్యాలీ

ఘనంగా ఆంజనేయుని ర్యాలీ

- వేలాదిగా తరలివచ్చిన భక్తులు
ముద్ర ప్రతినిధి, నిర్మల్: బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ల ఆధ్వర్యంలో ఆదివారం నిర్మల్ లో ఆంజనేయ స్వామి భారీ విగ్రహంతో శోభా యాత్ర నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాషాయ ధ్వజాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని స్థానిక దేవరకోట సమీపంలో ప్రారంభించారు.

అనంతరం ఈ శోభా యాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. దారిపొడవునా జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. పట్టణంలో ఎటు చూసినా కాషాయ దండు నిండి పోయింది.అంతకు ముందు మంత్రి డోలు వాయించి నృత్యం చేస్తూ అలరించారు. ఈ శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వీ హెచ్ పి నాయకులు, బజరంగ్ దల్ నాయకులు, మునిసిపల్ చైర్మన్ ఈశ్వర్ పాల్గొన్నారు.