కడెం ప్రాజెక్టు మరమ్మతు లో ఉద్యోగి మృతి

కడెం ప్రాజెక్టు మరమ్మతు లో ఉద్యోగి మృతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేస్తున్న సమయంలో ప్రాజెక్ట్ ఉద్యోగి లష్కర్ గంగాధర్(59) ప్రమాద వశాత్తు ప్రాజెక్టులో పడి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రాజెక్టు ఉద్యోగి గంగాధర్ ఎప్పటిలాగే ప్రాజెక్ట్ గేటు మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా ముందు జాగ్రత్త కోసం కట్టుకున్న తాడు తెగిపోయింది. దీంతో ప్రాజెక్ట్ ముందు భాగంలో దాదాపు 60 అడుగుల ఎత్తునుండి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు మామడ మండలం పొన్కల్ కు చెందినవాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.