డాక్టర్ల కోసం ప్రజలు వెళ్ళాల్సిన అవసరం లేదు
డాక్టర్ల కోసం ప్రజలు వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. డాక్టర్లే మీ ఇంటి దగ్గరకు వస్తారన్నారు. మంచానికి పరిమితమైన రోగుల వద్దకు వైద్య సేవలు వస్తాయన్నారు. మందులు కూడా ఉచితంగా అందించే ఫ్యామిలీ డాక్టర్స్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టామన్నారు.
పల్నాడు జిల్లా లింగంగంట్లలో ఇంటింటా వైద్యం, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ప్రారంభం. ఫ్యామిలీ డాక్టర్ వైద్యవిధానం ద్వారా గ్రామాలలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు. డాక్టర్ కోసం తిరగాల్సిన అవసరం లేదన్న సీఎం జగన్. ఇంటి వద్దకే వైద్యులు వస్తారన్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు, టీబీ వ్యాధులను తొలి దశలోనే గుర్తించవచ్చాన్నారు. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లలో 105 రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం తమదని చెప్పారు. ప్రతి మండలానికి నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు.