నామినేషన్ల ప్రక్రియ షురూ..

నామినేషన్ల ప్రక్రియ షురూ..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారి నిబంధనల మేరకు పోలీసులు తగు చర్యలు చేపట్టారు. కాగా నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థుల మీడియా కవరేజ్ కోసం వెళ్లేందుకు స్థానిక విలేకరులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. స్థానికంగా మీడియా పాయింటు కూడా లేకపోవడంతో జర్నలిస్టులందరూ ఆరుబయట నిల్చోని ఇబ్బంది పడాల్సి వచ్చింది.