అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

హాత్ సే హాత్ జోడో యాత్రలో గండ్ర సత్యనారాయణ రావు

ముద్ర న్యూస్: రేగొండ గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వడగళ్ళ వర్షాలకి అనేక పంటలు నొలకోరిగి రైతు చాలా నష్ట పొగ రేగొండ మండలంలో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు సోమవారం కోటంచ గ్రామ శివారులో వడగళ్ల వాన వల్ల నష్టపోయినమొక్క జొన్న పంటలను పరిశీలించరు ,నష్టపోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసారు.

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వడగళ్ళ వర్షము అధికంగా కురిసి మిర్చి ప్రత్తి మామిడి జొన్న రైతులు ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వెక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమీక్షలతో పని లేకుండా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య మేకల భిక్షపతి  కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుటోజు కిష్టయ్య బానోతు రవీందర్ గండి తిరుపతి తదితరులు పాల్గొన్నారు