టాలీవుడ్ నటుడు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి ...
ముద్ర,తెలంగాణ:- టాలీవుడ్ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా అద్దంకి -నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.నల్గొండ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రావు బైక్ పై వెళుతుండగా .. రఘు బాబు BMW కారు ఢీ కొట్టింది.దీంతో జనార్దన్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో రఘుబాబు కారులోనే ఉన్నాడు.ఆ సమయంలో అయన డ్రైవర్ కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది.
నల్లగొండ బైపాస్ రోడ్డులో నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకిస్ట్ మృతి
— Telugu Scribe (@TeluguScribe) April 17, 2024
ఈ ప్రమాదంలో నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు మృతి.
బైకును దాదాపు యాభై మీటర్ల దూరం లాక్కెళ్సి కారు. pic.twitter.com/9gymZvTGcm