షబ్బీర్ భాయ్... ఏ తరిక ఓత క్యా..

షబ్బీర్ భాయ్... ఏ తరిక ఓత క్యా..

జాతీయ జెండాకు వందనం చేయని షబ్బీర్ అలీ

ముద్ర ప్రతినిధి కామారెడ్డి: స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ జాతీయ జెండాకు వందనం చేయకపోవడం శోచనీయమని పలువురు విమర్శిస్తున్నారు.

భాగ్యనగరంలోని తన నివాస గృహ పరిధిలో మంగళవారం జెండావిష్కరించారు కాగా జెండాకు వందనం చేయలేని ఒక వీడియో వైరల్ గా మారింది దీంతో కామారెడ్డి ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. జాతీయ జెండాకు గౌరవం ఇవ్వకపోవడం శోచనీయమని అంటున్నారు. అనేకసార్లు ప్రజలతో ఎన్నుకోబడి మంత్రిగా కొనసాగిన షబ్బీర్ అలీ కి జాతీయ జెండాకు వందనం చేయడం తెలియదా ఎందుకు ఈ పక్షపాతం అని ప్రశ్నిస్తున్నారు