మాయా పేటిక’ ట్రైలర్
విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ ‘మాయా పేటిక’. రమేష్ రాపర్తి దర్శకత్వంలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేస్తున్నారు. మొబైల్ ఫోన్ ప్రధానంగా సాగే సినిమా ఇది. అలాగే మొబైల్ మన జీవితాల్లో ఎంత కీలకంగా మారిందనే విషయాలను కూడా ఇందులో చూపిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్, లిరికల్ వీడియోలకు ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ప్రపంచమంతా సెల్ ఫోన్కి ఎలా దాసోహమైందనే విషయాన్ని ట్రైలర్లో చూపించారు. అలాగే ఈ సినిమాలో స్మార్ట్ ఫోన్ హీరో. తనే ఈ కథను అందరికీ చెబుతుంది. అందరి జీవితాల్లో తనొక భాగంగా ఎలా మరిపోయాననే విషయాన్ని తనే వివరిస్తుంది. ఈ 3 నిమిషాల ట్రైలర్లో చాలా కథలను చూపిస్తూనే అవన్నీ స్మార్ట్ ఫోన్కు ఎలా కనెక్ట్ అయ్యాయనేది చూపిస్తున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్ వల్ల వారి జీవితాలు తలకిందులుగా ఎలా మారిందనే విషయాన్ని కూడా చూపిస్తున్నారు. అలాగే ఓ మంచి సస్పెన్స్ను కంటిన్యూ చేస్తూ వచ్చారు.