'బ్రో'చే వారెవరురా?

'బ్రో'చే వారెవరురా?

మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్లలో శ్రతి హాసన్ ఒకరు. ఒకటిరెండు కాదు అన్ని రంగాల్లోనూ ఆకట్టుటకుంటుంది. అందానికి అందం నటనకు నటన పాట పాడిందంటే స్టార్ సింగర్స్ కూడా సరిపోరు. ఇక డ్యాన్స్ కూడా ఇరగదీస్తుంది. ఇలా అన్ని రంగాల్లో టాలెంట్ ఉండటం చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమౌతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ లు కలిసి  బ్రో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం శ్రుతిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక చాలా మంది హీరోయిన్లు కేవలం ఒక్క ఇండస్ట్రీలో మాత్రమే సత్తా చాటగలరు.

కానీ ఆమె మాత్రం బాలీవుడ్ టాలీవుడ్ కోలివుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ సత్తాచాటుతోంది.ఇటీవల టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు శ్రుతి మంచి ఆప్షన్ గా మారారు. కాగా సోషల్ మీడియాలోనూ  శ్రుతి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె బికినీలో ఓ నాటీ ఫోటోని షేర్ చేసింది. బికినీలో బీచు ఒడ్డున పడుకున్నట్లుగా ఉంది ఆ ఫోటో కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టి మూతి సున్నాలా చుట్టేసి సెల్ఫీ తీసుకుంది. ఆ క్యూట్ నాటీ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా శ్రుతి ఇటీవల వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాలతో అలరించింది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.