ఎన్ఎస్ఎస్ అధ్వర్యంలో స్వచ్చ భారత్

ఎన్ఎస్ఎస్ అధ్వర్యంలో స్వచ్చ భారత్

ముద్ర,పానుగల్:-పానుగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కళాశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ కవర్లు, చెత్త చెదారం తొలగింపు తదితర కార్యక్రమాలను చేపట్టారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రకాశం శెట్టి మాట్లాడుతూ విద్యార్థులు సేవా భావాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఎన్ఎస్ఎస్ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, బోధన, బోధనేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.