హరీష్ రావు అబద్దాలకు అబద్దాలు ఆత్మహత్య చేసుకుంటాయి: తీన్మార్ మల్లన్న

హరీష్ రావు అబద్దాలకు అబద్దాలు ఆత్మహత్య చేసుకుంటాయి: తీన్మార్ మల్లన్న

ముద్ర ప్రతినిధి, మెదక్: హరీశ్​ రావును చుస్తే అబద్దాలు ఆత్మహత్య చేసుకుంటాయని కాంగ్రెస్​ ప్రచార కమిటీ బాధ్యులు తీన్మార్ మల్లన్న ద్వజమెత్తారు. గురువారం రాత్రి మెదక్ నవాబుపేటకు చెందిన మున్సిపల్​ కౌన్సిలర్​ దొంతి లక్ష్మీ, మాజీ కౌన్సిలర్​ ముత్యంగౌడ్​ దంపతులు మల్కాజ్​ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావ్​ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మల్లన్న మాట్లాడుతూ మంత్రి హరీశ్​ రావు పొద్దున లేచిన నుంచి అన్నీ అబద్దాలే చెబుతున్నారని ధ్వజమెత్తారు.

మెదక్ లో ఎమ్మెల్యే ఎవరు, మంత్రి ఎవరో అర్థం కాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్నపుడు నాగార్జున సాగర్, సింగూర్​ ప్రాజెక్ట్ లు కట్టారు. వాటికి ఇప్పటి వరకు కనీసం పగుళ్లు కూడా రాలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్​ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజి​ ఏడాదిలోపే కుంగిపోయిందన్నారు. అలాగే కేసీఆర్​ ప్రభుత్వం కట్టిన డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు కుక్కతోక తాకినా కూలిపోయేటట్టున్నాయని ఆరోపించారు. కేసీఆర్​ మాత్రం తొమ్మిదెకరాల్లో బంగ్లా కట్టుకున్నాడన్నారు.

కేసీఆర్​ పాస్​ పోర్టు బ్రోకర్​: మైనంపల్లి హన్మంతరావు

సీఎం కేసీఆర్​ పాస్​ పోర్టు బ్రోకర్​ అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావ్​ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ తన కొడుకు రోహిత్​ స్మాట్​గా ఉన్నాడని పొగిడిన నోటితోనే దిష్టిబొమ్మఅని విమర్శించడం ఆయన రెండు నాల్కల దోరణికి నిదర్శనమన్నారు. చిన్న పిల్లోడిని పట్టుకుని దిష్టిబొమ్మ అనడానికి నోరెలా వచ్చిందని కేసీఅర్​ను ప్రశ్నించారు. సీఎం ఫామ్​ హౌజ్​కు పోయేందుకు ఏడాదికి 80 కోట్లు ఖర్చు చేస్తున్నారు కానీ, పేదలకు డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు ఇచ్చేందుకు చేతులొస్తలేవని విమర్శించారు. కేటీఆర్​ తెలంగాణాకు ఏమి పడగొట్టారని మంత్రి పదవి ఇచ్చారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్​ఎస్​ ను గద్దెదించడం ఖాయం, కేటీఆర్​ అమెరికాకు పారిపోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ పార్టీ నాయకులు సురెందర్ గౌడ్, జీవన్​ రావ్, ప్రశాంత్​ రెడ్డి, ప్రవీణ్​ గౌడ్, బొజ్జపవన్, ఉప్పల రాజేష్​, సుభాష్​ చంద్రబోస్ తదితరులు ఉన్నారు.